నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారు. దిశ చట్టం అంటూ మాయ చేసారు. ఇప్పుడు గన్ను రావడం లేదు జగన్ కనపడటం లేదు. ఒక్క మహిళకు న్యాయం జరిగింది లేదు. కళ్ళ ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ రెడ్డిలో చలనం రావడం లేదని అన్నారు.
అయితే నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేసాడు మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చ నుండి బయటికి వచ్చి మహిళలకు రక్షణ కల్పించాలి. అనూషని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని, అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు @ysjagan వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారు.దిశ చట్టం అంటూ మాయ చేసారు.ఇప్పుడు గన్ను రావడం లేదు జగన్ కనపడటం లేదు.ఒక్క మహిళకు న్యాయం జరిగింది లేదు. కళ్ళ ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ రెడ్డి లో చలనం రావడం లేదు.(1/3) pic.twitter.com/nskKMD0pZP
— Lokesh Nara (@naralokesh) February 24, 2021