ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైనప్పటి నుంచి ఆ పార్టీలో వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చాలా మంది ఇప్పటికే బీజేపీ, వైసీపీలో చేరిపోవడంతో ఆ పార్టీ కోలుకోలేని స్థితికి చేరింది. ఇలాంటి తరుణంలో తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మ వైసీపీలో చేరారు.
అయితే క్యాంప్ కార్యాలయంలో మంతెన అనంత వర్మకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మతో స్థానిక టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి. వెంకటేశ్వరరాజు, ఎం.వి. సర్వేశ్వర యాదవ్, పృద్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డి తదితరులు సైతం వైపీసీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి పాల్గొన్నారు.